Pages

Thursday, April 23, 2015

విష్ణు మహిమ

Edit Posted by

ఒక రోజు అక్బర్ బీర్బల్ ని సరదాగా ఆట పట్టించాలని అనుకున్నారు.

“బీర్బల్, నాకొక సందేహముంది, తీరుస్తావా? అలనాడు విష్ణుమూర్తి ఒక ఏనుగు ఆర్తనాదాలు విని వెంటనే దాన్ని రక్షించడానికి పరిగెట్టాడని నేను వేద పురాణాలలో వుందని విన్నాను. యెందుకలా? అక్కడ సేవకులెవరూ లేరా?” అని అక్బర్ బీర్బల్ ని అడిగారు.
బీర్బల్ ఇలా జవాబు చెప్పాడు, “సమ్రాట్, మీ సందేహం నేను సమయమొచ్చినప్పుడు తీరుస్తాను!”
కొన్ని రోజులు గడిచాయి. బీర్బల్ ఒక పనిమనిషిని పిలిచి ఆమె చేతికొక మైనపు బొమ్మను ఇచ్చాడు. బొమ్మ అచ్చు ఒక శిశువు రూపంలో ఉంది. “ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు, ఈ బొమ్మని తీసుకుని నీట్లో పడిపోయినట్టు నటించు, నీకు మంచి బహుమానమిప్పిస్తాను,” అని ఆ పనిమనిషికి చెప్పాడు.
అలాగే పనిమనిషి సాయంత్రం అక్బర్, బీర్బల్ తోటలో విహరిస్తుంటే తోట నడిమధ్య ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్టు నటించింది. తనతో పాటు ఆ శిశువు బొమ్మకూడ నీళ్ళల్లో పడిపోయింది.
అక్బర్ ఈ దృశ్యం  చూడగానే వెంటనే నిండు బట్టలతోనే నీళ్ళల్లోకి దూకి ఆ శిశువు బొమ్మని కాపాడ సాగాడు.
బీర్బల్ మడుగు గట్టున నిలుచుని, “మహారాజా, యెందుకు మీరు నీళ్ళల్లో దూకరు? సేవకులని పురమాయిస్తే సరిపోయేది కదా?” అన్నాడు.
“ఒక శిశువు ప్రాణాపాయ స్థిథిలో కనిపిస్తే మీరు యెలా ముందూ వెనకా చూడకుండా ఆదుకోవాలనుకున్నారో, విష్ణుమూర్తి కూడా అలాగే తన భక్తుడైన ఆ ఏనుగుని కాపాడడానికి వెనకాడలేదు” అని చాలా తెలివిగా అక్బర్ సందేహం తీర్చాడు.

బీర్బల్ జ్వరం

Edit Posted by


ఒక సారి బీర్బల్కి బాగా జ్వరమొచ్చి కొన్ని రోజులు రాజసభకు వెళ్ళలేదు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. ఇన్ని రోజులు బీర్బల్ కనిపించకపోతే ఆత్రుతతో బీర్బల్ని చూడడానికి అతని ఇంటికి వెళ్ళారు.
బీర్బల్ జ్వరం వల్ల నీరశించి, చిక్కి శైల్యం అయ్యి ఉన్నాడు.
అక్బర్కి అతని అవగాహనా శక్తులు తగ్గాయేమో అని సందేహమొచ్చింది. అందుకే బీర్బల్ మంచినీళ్ళ కోసం పక్క గదిలోకి వెళ్ళినప్పుడు అక్బర్ అతని చేతి రూమాలు తీసి ఒక మంచం కోడు కింద పెట్టాడు.
తిరిగి వచ్చి బీర్బల్ మంచం మీద పడుక్కుంటే యేదో తేడాగా ఉన్నట్టు అనిపించింది.
అక్బర్ యేమి యెరగనట్టు బీర్బల్తో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. కాని బీర్బల్ మట్టుకు ధ్యాసగా వినలేకపోయాడు.
కొంతా సేపు ఇలా సాగాక, అక్బర్ బీర్బల్ పరధ్యానానికి కారణం యేమిటని అడిగాడు.
“ఈ గదిలో యేదో మారినట్టుంది,” అని బీర్బల్ జవాబు చెప్పాడు.
“మారిందా? యేమిటి మారిందంటావు?” అని అక్బర్ అన్నారు.
“ఈ మంచం ఒక మూల యెత్తుగా వున్నట్టుంది,” అని అన్నాడు.
“జ్వరమొచ్చి నప్పుడు అలా అనిపిస్తుంది,” అని అక్బర్ జాలి మొహం పెట్టి అన్నారు.
“మహారాజా! నా శరీరానికి జ్వరమొచ్చింది కాని నా మెదడుకు రాలేదు!” అని బీర్బల్ నవ్వుతూ అక్బర్తో అన్నాడు.
అక్బర్ కూడా నవ్వి అతను బీర్బల్కి పెట్టిన పరీక్ష గురించి చెప్పారు

నాణాల సంచి

Edit Posted by
తగువు తీర్చమని బీర్బల్ ని అడిగారు.
“అసలు గొడవ యేమిటి?” అని బీర్బల్ అడిగాడు.
అప్పుడు కసాయి వాడు ఇలా చెప్పాడు, “నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలకి వెళ్ళి నప్పుడు ఇతను నా నాణాల సంచి తీసుకుని అది తనదే అని గొడవ చేస్తున్నాడు. నా డబ్బు సంచి నాకు ఇప్పించండి”
వెంటనే ఆ చమురు వ్యాపారి, “లేదు! అతను చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ సంచి నాదే. నేను నాణాలు సంచి లోంచి తీసి లెక్ఖ పెడుతున్నాను. అది చూసి ఇతను దురాశతో నా సంచి కాచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయం చెప్పండి.” అన్నాడు.
బీర్బల్ యెన్ని సార్లు అడిగినా వాళ్ళిద్దరు చెప్పిన మాటే మళ్ళి మళ్ళి అదే మాట చెప్ప సాగారు.
ఈ గమ్మత్తైన సమస్యకి బీర్బల్ ఒక యుక్తిని అలోచించాడు.
ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తెప్పించాడు. ఆ నీళ్ళల్లోకి సంచిలో నాణాలు వేశాడు. వెంటనే ఆ పాత్రలో నీళ్ళపైన పలచగా నూనె తేలింది.
ఆ తెట్టు చూసిన వెంటనే ఆ సంచి చమురు వ్యాపరిదని అందరూ గ్రహించారు.
బీర్బల్ సంచిలో మళ్ళి నాణాలు నింపి చమురు వ్యాపరికి ఇచ్చేసాడు. ఆ కసాయిని కఠినంగా శిక్షించాడు.

బంగారు బిందె

Edit Posted by

కట్టెలు కొట్టేవాడి చేతిలోంచి గొడ్డలి జారి కింద పడింది.. నీటి దేవత బంగారు గొడ్డలి తెచ్చింది.. ఈ కథ తెలిసిందే కదా? అనేక రూపాలలో ఈ కథ ఆంధ్రదేశం అంతటా వ్యాప్తిలో ఉంది. దాని ఒక రూపాన్ని ఓమలత మీతో పంచుకుంటోంది. చూడండి:
సేకరణ: ఓమలత, మూడవ తరగతి, టింబక్టు బడి, చెన్నేకొత్తపల్లి, అనంతపురం జిల్లా.

ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఇద్దరు భార్యలు. వాళ్లలో మొదటి భార్య చాలా చెడ్డది, రెండవ భార్య చాలా మంచిది. ఒకరోజు చిన్న ఆయమ్మ పెద్ద ఆయమ్మను దూరంగా ఉన్న బావినుండి నీళ్లు తెమ్మని పంపించింది. చిన్న ఆయమ్మ ’సరే’ అని వెండి బిందె పట్టుకొని బావి దగ్గరకు వెళ్లింది.
అయితే ఆమె చేతిలోంచి బిందె జారి నూతిలో పడిపోయింది. బిందె పోగొట్టుకున్నందుకు ఆమె చాలా బాధపడింది- లోతుగా ఉన్న బావిలోకి దిగలేక ఏడిచింది. అప్పుడు ఆ బావిలోంచి గంగా దేవత ప్రత్యక్షమైంది. ఆమె తన చేతిలో ఒక బంగారు బిందెను పట్టుకొని ఉన్నది. ’ఇదేనా, నీ బిందె? బంగారు బిందె?’ అని అడిగింది. ’కాదు’ అన్నది చిన్న ఆయమ్మ. గంగా దేవి వెళ్లి, ఈసారి ఇత్తడి బిందెతో తిరిగి వచ్చింది: ’ఇదేనా నీ బిందె? ఇత్తడి బిందె?’ అని అడిగింది. ’కాదు’ అన్నది చిన్న ఆయమ్మ. మళ్లీ గంగాదేవి వెళ్లి, ఈసారి ఆయమ్మ బిందెతోనే తిరిగి రాగానే, చిన్న ఆయమ్మ ’అదే, అదే, నా బిందె!’ అన్నది. ఆ దేవత ఆయమ్మ మనసును తెలుసుకొని చాలా సంతోషపడింది. ’ఈ మూడు బిందెలూ నువ్వే తీసుకో, చాలా మంచిదానివి’ అన్నది. అని, ఆయమ్మకు మూడు బిందెలూ ఇచ్చేసింది. చిన్నాయమ్మ మూడు బిందెలూ పట్టుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది.
ఇది చూసిన పెద్దాయమ్మ ఊరుకోలేదు. ’ఇన్ని బిందెలు ఎక్కడివి?’ అని అడిగింది. ’నాకు బావిలో దేవత ఇచ్చింది’ అని చిన్నాయమ్మ చెబితే, పెద్ద ఆయమ్మ కూడా పోయిందక్కడికి, బిందెలకోసం. ఊరికే యాక్షన్ చేసుకుంటూ పోయి, కావాలని తన ఇత్తడి బిందెను బావిలోకి జారవిడిచింది. గంగా దేవి ఆమె బిందెనే తీసుకొని ప్రత్యక్షమైంది: ’ఈ బిందె నీదేనా?’ అని అడిగింది. ’ఉహుఁ, కాదు’ అన్నది పెద్ద ఆయమ్మ. ’అయితే ఇది నీదేనా’ అన్నది గంగాదేవి, వెండి బిందెను తెచ్చి. ’కాదు’ అన్నది పెద్దాయమ్మ బంగారు బిందెపైన ఆశతో. మళ్లీ గంగాదేవి బంగారు బిందెను తేగానే ’అదే, అదే, నాబిందె!’ సంతోషంతో అరిచింది పెద్దాయమ్మ. దాంతో గంగాదేవికి చాలా కోపం వచ్చింది. ’నువ్వు చాలా చెడ్డదానివి, నీకు ఏబిందే ఇవ్వను పో’ అని ఆమె మాయం అయిపోయింది. దాంతో పెద్దాయమ్మకు బుద్దివచ్చి మంచిదైపోయింది. ఆనాటినుండి ఆశపోతుగా ఉండకుండా మంచిగా ఉండింది.
Courtesy : http://kottapalli.in/2008/05/%E0%B0%AC%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B